AP: NTR జిల్లాలో పోలీసులు భారీగా అల్ఫ్రాజోలంను సీజ్ చేశారు. కొండపల్లిలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బొల్లారానికి చెందిన సాయి త్రిభువన్ వర్మ, సౌరబ్ కుమార్ను అరెస్ట్ చేసి 200 కేజీల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.