తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర గురువారం ఆవిష్కరించారు. మార్చి 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 16న అంకురార్పణం జరుగుతుందని, మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27–29 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.