ATP: గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం స్థావరంపై పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు చేశారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. సుమారు 130 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.