KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. గురువారం రూ. 10 పెరిగి రూ. 7,500 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్కు రైతులు 13 వాహనాల్లో 98 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి ధరల్లో మార్పు కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.