కంటి తెల్లసొనపై అకస్మాత్తుగా కనిపించే ఎర్రటి మచ్చను ‘సబ్ కంజంకైవల్ హేమరేజ్’ అంటారు. ఇది రక్తనాళం పగిలి రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. గట్టిగా దగ్గడం, తుమ్మడం లేదా హైబీపీ వల్ల ఇలా జరుగుతుంది. ఇది చూపుపై ప్రభావం చూపదు. ఒకటి రెండు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ నొప్పిగా ఉన్నా, చూపు మసకబారినా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది.