WGL: ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలోని సాయి సిద్దార్థ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రూ.4 లక్షల విలువైన నిల్వ చేసిన కల్తీ కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇండస్ట్రీ నిర్వాహకుడు సురేష్ను టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ స్థానిక ఎనుమాముల పోలీసులకు అప్పగించారు. కల్తీ కారం తయారీపై కేసు నమోదు చేశారు.