రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. మజ్జిగతో వేడి తగ్గుతుంది. గోరువెచ్చని పాలలో తేనె కలిపి రోజూ తాగాలి. డైలీ ఒక స్పూన్ మెంతులను ఆహారంలో చేర్చుకోవాలి.