KMM: హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని, కానీ, ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఇప్పటికే 11.57 లక్షల మంది అర్హులను గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.