KMR: లింగంపేటలోని మంబోజీపేట్ రైతు వేదిక వద్ద గురువారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సదస్సులో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నానో యూరియా వినియోగం ద్వారా పంటల దిగుబడి పెంపు, ఖర్చులు తగ్గించే విధానాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను తెలుసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు