SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు శనివారం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్, విజ్ఞాన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.