WGL: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ నేడు మంత్రి కొండా సురేఖను కలిశారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణకు మంత్రి సురేఖ సూచించారు.