NGKL: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ.. ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, యువత వీటికి దూరంగా ఉండాలన్నారు.