NLG: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఈవో బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,147(బాలురు), 9,551(బాలికలు), 137(ప్రైవేటు) ఉన్నట్లు వివరించారు.