NZB: బీసీ రాజ్యాధికార సమితి సమావేశం బుధవారం నిజామాబాదు నగరంలో జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ దంపతులను సమితి ప్రతినిధులు సన్మానించారు. బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని మేయర్ ఉమారాణి సూచించారు. సమితి ప్రతినిధులు బాస రాజేశ్వర్, జీ.రాజేశ్వరి, డాక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.