PDPL: జిల్లా జడ్జి సునీత ఆదేశాల మేరకు ఇవాళ మేడారం జడ్జి సరిత, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎస్హెచ్ఓతో కలిసి ధర్మారం మండలం కొత్తపల్లి దేశాయి నాయక్ ఇటుకబట్టిని తనిఖీ చేశారు. ఒరిస్సాకు చెందిన 30 మంది కార్మికులు తమకు 6 నెలలకు 40,000 చెల్లించాడని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులకు విముక్తి కల్పించామని జడ్జి సరిత తెలిపారు.