MBNR: జడ్చర్ల మండలం గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రెండు ఏసీలను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం వీటిని బహూకరించిన బ్యాంక్ మేనేజర్ అశోక్, సిబ్బందిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దీప్తి రెడ్డి బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.