SRD: జిల్లాలో ఈనెల 14 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లావ్యాప్తంగా 123 కేంద్రాల్లో 24,611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి’ అని సూచించారు.