GDWL: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య అందుతుంది అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గద్వాల ప్రభుత్వ ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాల నూతన ప్రవేశాల అవగాహన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.