VSP: మురళీనగర్లోని ప్రశాంత్ పార్క్ అభివృద్ధి కోసం స్థానిక నాయకులు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న ప్రహరీ గోడను అభివృద్ధి చేయడం, స్టోర్రూమ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.