NRPT: నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎక్సైజ్, పోలీస్ విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 20 పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు (ప్రహరీ క్లబ్) సభ్యులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే శారీరక, మానసిక, సామాజిక విపత్తులపై శిక్షణ ఇచ్చామన్నారు.