ADB: ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్య ప్రచారాలు సరైనవి కావని గుడిహత్నూర్ మండల PACS మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్, మాధవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా నిధులకు జాప్యం జరిగిందని పేర్కొన్నారు.