IPL-19వ సీజన్కు ముందు KKR జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరానా (శ్రీలంక) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. T20 WCలో గాయపడిన అతడు కోలుకోవడానికి చాలా సమయంపడుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో అతడు ఈ సీజన్ ఆడే సూచనలు కనిపించడం లేదు.