MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 491 మంది అర్హులను గుర్తించినట్లు MRO కృష్ణ బుధవారం తెలిపారు. మొత్తం 160 ఇళ్లకు గానూ, ప్రస్తుతం 108 ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. అర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.