TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.