NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.