VZM: మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.