AKP: బుచ్చియ్యపేట మండలం లోపూడి శివారు బంగారు మెట్టలో రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.16,110, కొన్ని పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.