RR: కడ్తాల్ మండలం రావిచేడ్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 95 వేల నిధులతో నిర్మించనున్న ఇంకుడు గుంత నిర్మాణానికి మంగళవారం సర్పంచ్ బొప్పిడి గోపాల్, ఎంపీడీవో సుజాత భూమి పూజ చేశారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. ఈసీ వాణి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.