AP: CMపై మాజీమంత్రి బుగ్గన ఆరోపణలను మంత్రి మండిపల్లి ఖండించారు. ‘గత YCP పాలనలో రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసి భూ సమస్యలను పెంచారు. రైతుల భూములు కబ్జా చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నేరం చేశారనే భయంతోనే CMపై ఆరోపణలు చేస్తున్నారు. భూ ఆక్రమణ నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. రైతుల హక్కులను కాపాడటం కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’ అని పేర్కొన్నారు.