CTR: పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర సందడి మొదలైంది. మంగళవారం రాత్రి ప్యాలస్లో జమీందారీ వంశస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాలలోనూ భక్తులు పూజలు చేశారు.