PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు నూతన ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సేవను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బస్సు కాల్వ శ్రీరాంపూర్ నుంచి ఓదెల, సుల్తానాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.