BHPL: జిల్లా వ్యాప్తంగా 1,31,236 క్వింటాళ్ల వరి ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.6.56 కోట్ల బోనస్ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలేదు. బోనస్ మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.