ఉగ్రకుట్రల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్ జారీ చేశారు. పంజాబ్, కాశ్మీర్లలో భద్రతాదళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. అమృత్సర్తో పాటు కాశ్మీర్లో లభ్యమైన రెండు IED బాంబులను గంటల వ్యవధిలోనే విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టిన భద్రతాదళాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.