SDPT: పదవ తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని గజ్వేల్ రూరల్ సీఐ రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్ రెడ్డి సూచించారు. క్షీరసాగర్లో ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులతో పాటు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఉదయ భాస్కర్ రెడ్డి పాల్గొని పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.