రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం పూలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, గ్రామ సర్పంచ్ ఎలిమెల భాగ్యలక్ష్మి మహేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ వార్డు సభ్యులు, నాయకులు పి.శ్రీనివాష్ రెడ్డి బి. నరసింహరెడ్డి, రాజు, మల్లేషం, విఠల్ గౌడ్ భిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.