NLG: దేవరకొండలోని రాంనగర్ 16వ వార్డుకు చెందిన రెడ్డి కోటేశ్వరరావు నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.