PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.