GDWL: బీజేపీ ప్రభుత్వం విదేశీ శక్తులతో ఒప్పందాలు చేసుకుంటూ మన దేశ రైతులకు ఉరితాడు బిగిస్తోంది అని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) జిల్లా అధ్యక్షుడు జి. గోపాల్ అన్నారు. సోమవారం చేనిగోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రైతులతో కలిసి నిరసన నిర్వహించారు. విత్తన బిల్లు, వీబీజీ రాంజీ బిల్లులు రైతులకు శాపంగా మారాయన్నారు.