దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు.