CTR: సుగుటూరు గంగమ్మ జాతర నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మంగళ, బుధవారాల్లో సెలవు పెట్టవద్దని కమిషనర్ సూచించారు. అనంతరం విధి విధానాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతర రెండు రోజుల పాటు ఎవరూ సెలవు పెట్టకూడదని, అలా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.