SDPT: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రగతి వనంలో సిబ్బందితో కలిసి కమిషనర్ చెత్త క్లీన్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయొద్దన్నారు.