GDWL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు ప్రజల నుంచి 96 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.