MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రామాయంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ప్రాంగణంలో సోమవారం అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు ప్రమాదాల పట్ల అప్రమత్తతపై పలు సూచనలు చేశారు.