JN: GMPS జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాదం రమేష్ పిలుపునిచ్చారు. తరిగొప్పుల గ్రామంలో సోమవారం GMPS మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. 42% రిజర్వేషన్ అమలు, గొర్రెల కాపరులకు రక్షణ చట్టం, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో GMPS నాయకులు తదితరులు ఉన్నారు.