JN: మహిళా సమస్యల పట్ల పోరాడాలని పార్టీలో, సమాజంలో మహిళల్లో చైతన్యం నింపే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఇవాళ ఎమ్మెల్యే కడియంతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతో పాటు పార్టీలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు.