EG: రాజమహేంద్రవరం APSRTC దగ్గర BSL డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో NSS వాలంటీర్స్ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి బస్సు డిపో శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు శుభ్రతను పాటించాలని NSS వాలంటీర్స్ ప్లకార్డ్ పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. NSS ఆఫీసర్ ఆర్ సైదా, డిపో మేనేజర్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.