TG: సిద్ధిపేటలో ప్రారంభమైన ఇఫ్తార్ విందులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట మినార్ ఈద్గా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న హరీష్ రావు.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగించారన్నారు. ముస్లిం మైనార్టీ గురుకులాలను కేసీఆర్ ప్రారంభించారన్నారు.