SRPT: మట్టపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప ఆగ్రో ఏజెన్సీలో నిషేధిత బయో పురుగుమందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుండి తెచ్చిన బయో రసాయనాలను స్థానికంగా విక్రయిస్తూ, ముఖ్యంగా వరి పంటలకు విస్తృతంగా పిచికారి చేస్తున్నారనే వాదనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు ఆ షాప్పై రైడ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.