SKLM: ఆమదాలవలస మండలం వంజంగి పేట గ్రామ సర్పంచ్ పైడి లక్ష్మీకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11న ఢిల్లీలో పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని తనకు ఆహ్వానం అందినట్లు సర్పంచ్ పైడి లక్ష్మీ ఆదివారం తెలిపారు.