SRPT: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపవద్దని కోరారు.